విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు
మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొర్ర సుమలత సేవా సంకల్పంతో విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ పంపిణీ ములుగు ప్రతినిధి , సెప్టెంబర్ 17, తరంగాలు :విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం,మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొర్ర సుమలత అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయన ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ పంపిణీ చేశారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొర్ర సుమలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు...